జనసైనికులకు పవన్ కల్యాణ్ కీలక సందేశం

by Disha Web Desk 2 |
జనసైనికులకు పవన్ కల్యాణ్ కీలక సందేశం
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన కార్యకర్తలు, నాయకులకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక సందేశం పంపించారు. పొత్తు ధర్మాన్ని పాటిద్దాం.. కూటమిని గెలిపిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి పెట్టుకున్నట్లు తెలిపారు. పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు పార్టీలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో ముందకు వెళ్లాలని సూచించారు. కాగా, ఏపీ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా జరుగుతోంది. జగన్ ఓటమే లక్ష్యంగా కూటమి పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. టీడీపీ అయిదు స్థానాలు మినహా తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. పవన్ తమ పార్టీ నుంచి పోటీ చేసే 21 స్థానాల్లో 18 మందిని ప్రకటించారు. మిగిలిన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed